- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ అపైర్స్ కమిటీ మెంబర్ గా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ షబ్బీర్ అలీని నియమించినందుకు మండల కాంగ్రెస్ శ్రేణులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తమ నాయకునికి బాధ్యతయుత పదవిని ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షులు కార్గే, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జి రెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, నాయకులు అంబాయి ప్రసాద్, వడ్ల లక్ష్మీరాజం, బిట్ల నర్సింగరావు, బొంపల్లి రాజేందర్, మోచే శివరాం తదితరులు ఉన్నారు.
- Advertisement -