- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కోట రాజబాబు గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్,జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి, అధికారప్రతినిది జంపయ్య నాయక్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అంధించి,శాలువాలతో ఘనంగా సన్మానించారు. రాజబాబుకు చైర్మన్ పదవి ఇవ్వడంపై రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -