- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశానుసారం రమేష్ దేశాయి గారి చేతుల మీదుగా కేమ్రాజ్ కల్లాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు రమేష్ దేశాయ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా పేద ప్రజలు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్న క్రమంలో వారి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నాగు పటేల్ డీలర్ విలాస్ సుంకారి శంకర్ గ్రామపంచాయతీ కార్యదర్శి జీవన్ మరియు గ్రామస్తులు అందరు , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -