- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ చైర్మన్ దండు రమేష్ ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడుగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాటారం మండలం కాంగ్రెస్ నాయకులు శనివారం నాగులమ్మ ఆలయం ఆవరణలో ఆయనను శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -