- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర
బంగారు చెలిమి తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరావత్ నిమ్మ నాయక్ తల్లి రుక్కమ్మ (82) వృద్ధాప్యంతో ఆదివారం మృతి చెందారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రుక్కమ్మ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, ముత్తినేని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



