- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలో మల్లారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేనవేన లక్ష్మీమల్లు తల్లి మల్లక్కఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీనుబాబు ఆదేశాల మేరకు.. శుక్రవారం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు నెరేడుగొమ్మ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగన్నపేట మురళి, భూక్య రాజునాయక్, రెవెళ్లి లింగయ్య, మేకల రాజయ్య, లింగన్నపేట రమేష్, ముంజం శంకర్, కన్నెవేన లక్ష్మణ్ పాల్గొన్నారు.
- Advertisement -