- Advertisement -
నవతెలంగాణ- మిరుదొడ్డి
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు చెన్నై భూపాల్ గౌడ్, జోగారి భాస్కర్, మహేందర్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన చెవుల నాగయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని వారు తెలిపారు. దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్య కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో రెండవ వార్డు సభ్యులు కిషన్, భూదవ్వ, రామవ్వ,బాలకిషన్,తో పాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



