- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ట్రాన్స్ కో డిఈ రాజేశ్వరరావు ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి సత్కరించారు. మండల కేంద్రం శివారులోని పాటి హనుమాన్ దేవాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ట్రాన్స్ కో డిఈ రాజేశ్వరరావును సుంకేట రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున డిఈ రాజేశ్వరరావు దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, విద్యుత్ శాఖ సిబ్బంది, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



