Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ మండలాధ్యక్షుడికి మాతృ వియోగం

కాంగ్రెస్ మండలాధ్యక్షుడికి మాతృ వియోగం

- Advertisement -

ఎమ్మెల్యే రేవూరి, టీపీసీసీ ఉపాధ్యాయులు దొమ్మటి సహా పలువురి పరమార్శ 
నవతెలంగాణ – పరకాల 
: కాంగ్రెస్ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి మాతృమూర్తి సమ్మక్క (70) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నాగారంలోని తన నివాసంలో శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. సమ్మక్క భౌతిక కాయానికి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య, కాంగ్రెస్ సమన్వయ కమిటీ నాయకులు సోదరామకృష్ణ, పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. వారితోపాటు దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ శ్రీను, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్లు మడికొండ సంపత్, ఏకు రాజు,ఒంటేరు రామ్మూర్తి, బొచ్చు భాస్కర్, మాజీ ఎంపీపీ స్వర్ణలత, దుగ్యాల రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad