- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొంది సత్తా చాటాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆమె క్యాంప్ ఆఫీసులో మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకుల సూచనలతో గ్రామాల, మండలాల వారిగా జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. నేడు కామారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ అభ్యాన్ సంఘటన జిల్లా సర్వసభ్య సమావేశం ఉందని తెలిపారు.
- Advertisement -