- Advertisement -
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్లలో శుక్రవారం 11:00 గంటలకి భూపాలపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బడితెల రాజయ్య అధ్యక్షతన స్థానిక సంస్థ గత ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం నిర్వహించ పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు కూడా చైర్మన్ ఇనుగల వెంకటరమణ రెడ్డి, లింగాజి హాజరవుతారని తెలిపారు. కావున మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
- Advertisement -