హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని మాజీ మంత్రి టి హరీశ్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్టు డ్రామా క్రియేట్ చేసారే తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిందిపోయి తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని విమర్శించారు.
బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్టు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపాలనీ, బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా 42శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చాలని సూచించారు. అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలనీ, ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించాలనీ, బీఆర్ఎస్ బీసీల కోసం నిలబడుతుందని తెలిపారు.
కాంగ్రెస్ది 42శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES