రైతు భరోసా సంబురాలు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి : ప్రజా పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. సీఎం తో పాటు పలువురు మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రైతు భరోసాతో పాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా వర్షాలతో తడిసిన ధాన్యంతో సంబంధం లేకుండా ప్రతి గింజను కూడా కొనే లక్ష్యంతోని రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.నేటికి 100 శాతం వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తి అవుతుందన్నారు.గతంలో ఎకరాకు పది వేల రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మా ప్రభుత్వం ఎకరాకు 12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు,గ్రామ అధ్యక్షులు ,యూత్ నాయకులు,అన్ని విభాగాల నాయకులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES