Tuesday, February 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత: ఎఫ్ఆర్ఓ

చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత: ఎఫ్ఆర్ఓ

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత అని ఎఫ్ఆర్ఓ రామకృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని జామ్ గ్రామంలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో చిత్తడి నేలల దినోత్సవం నిర్వంచారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. చిత్తడి నేలల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. వరద రక్షణ, స్వచ్ఛమైన నీరు, జీవవైవిధ్యం, మానవ ఆరోగ్యం,శ్రేయస్సు కోసం అవసరమైన వినోద అవకాశాలన అందించడం ద్వారా మన జీవితాలను మెరుగుపరచడంలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ముందుగా గ్రామ సమీపంలోని చెరువు వద్దకు విద్యార్థులను తీసుకువెళ్ళు చిత్తడి నేలల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రంలో ఉపాధ్యాయులు రాజేశ్వర్, డివైస్ఆర్వో నజీర్ ఖాన్, ఎఫ్ఎస్ఓ రషీద్,ఎఫ్బిఓ లు సుజాత,వెన్నెల,స్రవంతి,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -