- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద తెల్లవారుజామున జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కానిస్టేబుల్ కోలా నరేష్ (PC -184) అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చౌటుప్పల్ మార్చురికి తరలించారు. మృతుడి స్వస్థలం సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామం. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



