- Advertisement -
సర్పంచ్ సంతోష్ నాయక్
నవతెలంగాణ – నవాబు పేట
నిరంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కాకరజాల తండా సర్పంచ్ సంతోష్ నాయక్ అన్నారు. మంగళవారం కాకరజాల తండాలో ఐదు లక్షలతో నిర్మిస్తున్న అంతర్గత డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనుల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తండా అభివృద్ధికి అహర్నిశలు కృషిచేసి ఆదర్శ తాండాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడతానని, తండా అభివృద్ధికి మరింత నిధుల కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తాండాను అభివృద్ధి పథంలో నిలుపుతానని అన్నారు.
- Advertisement -



