నవతెలంగాణ – భువనగిరి : మండలంలోని వీరవెళ్లి గ్రామంలో ఉన్న కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ సీసీ రోడ్డు పనులను పూర్తి చేశారు. గత వారం రోజుల క్రితం గౌడ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆహ్వానం మేరకు గ్రామంలో ఉన్న కంఠమహేశ్వర స్వామి ఆలయంలో దైవ దర్శనం చేసుకుని తన సొంత డబ్బుతో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆదివారం తన సొంత డబ్బులతో సీసీ రోడ్డు పనులను ఆయన పూర్తి చేశారు. అలాగే గ్రామంలో పార్టీలకు అతీతంగా ఎక్కడా ఏమైనా ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోవీరవెల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కల్పనా శ్రీనివాసచారీ గారు, చందుపట్ల మాజీ సర్పంచ్ వల్లందాస్ ఆదినారాయణ , బండసోమారం తాజా మాజీ సర్పంచ్ నానం పద్మ కృష్ణ , వీరవెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రేగు శ్రీశైలం, మండల కార్యదర్శి సోకం రాజశేఖర్, గ్రామశాఖ ఉపాధ్యక్షులు సర్దార్ శ్రీనివాస్, రేగు ముత్తయ్య, వీరవెల్లి గ్రామ గౌడ సంఘం నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
పచ్చిమట్ల సొంత డబ్బులతో సీసీ రోడ్డు నిర్మాణం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES