- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కత్తల్వాడిలో బుధవారం సర్పంచ్ గోపాల్ రావు ఆధ్వర్యంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ముగ్గు పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, సర్పంచ్ లు మాట్లాడుతూ.. గ్రామంలో సొంతిల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గోపాల్ రావు, జిపి కార్యదర్శి, గృహ నిర్మాణాల లబ్ధిదారులు, గ్రామ పెద్దలు , జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



