- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మైబాపూర్, కంఠాలి జీపీ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను ఎంపిడిఓ శ్రీనివాస్ ముగ్గు వేసి పనులను మైబాపూర్ గ్రామ సర్పంచ్ కారేగామా బశవ్వ అశోక్ రెడ్డి , కంఠాలీ సర్పంచ్ మాత్రే నాగనాథ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మరియు గ్రామ సర్పంచ్ లు మాట్లాడుతు గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకం మంజురైన లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వెంటనే ప్రారంభించుకోవాలి అన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఇంటి స్థలం కొలతల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు , జిపి కార్యదర్శి, జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



