Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యత లేని సీసీరోడ్ల నిర్మాణం..

నాణ్యత లేని సీసీరోడ్ల నిర్మాణం..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మండలాభివృద్ది కోసం స్థానిక ఎమ్మెల్యే తోట ప్రభుత్వం నుండి భారీగా నిధులు మంజూరు చేయించిన విషయం విదితమే. కానీ ఆ నిధులు దుర్వినియోగం అవుతుండడం ప్రజలను కలవరపెడుతోంది. ఈమధ్య సీసీ రోడ్ల నిర్మాణం నాసిరకంగా వేశారు. దీనివల్ల నిన్నమొన్న పడ్డ మామూలు వర్షాలకే సిమెంటు రోడ్లలో కంకర తేలిడం, మధ్యమద్యలో గుంతలు పడడం చూసి, ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా రూ.55 లక్షలు ప్రజాధనం రోడ్డుపాలు చేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ నాసిరకం పనులకు కారణం కాంట్రాక్టర్లా.. లేక ప్రజా ప్రతినిధులా అని ఆరా తీస్తున్నారు. ఇప్పుడిప్పుడు వేసిన రోడ్లే ఇలా ఉంటే.. భవిష్యత్తులో వచ్చే వర్షాకాలం నాటికి ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో .. అసలు రోడ్డు కనిపిస్తుందా.. అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆవేదన మేరకు ఎమ్మెల్యే రోడ్డు పరిస్థితిని మళ్ళీ సంబంధిత అధికారులతో పరిశీలించి, నిర్లక్ష్యం ఎవరిదో వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -