నవతెలంగాణ – ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తోపాటు మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీల నుండి అనుమతి పొందిన ఇండ్లకే తాపీ మేస్త్రీలు నిర్మాణం పనులను చేపట్టాలని ఎంపీడీవో శివకుమార్ శనివారం తెలిపారు. గ్రామాలలో కొంత మంది గ్రామపంచాయతీల నుండి అనుమతులు లేకుండా అక్రమంగా ఇండ్లు నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అయితే తాపీ మేస్త్రీలు సంబంధిత ఇండ్ల నిర్మాణ పనులు చేసేటప్పుడు గ్రామపంచాయతీ నుండి అనుమతి తీసుకుంటేనే నిర్మాణాల పనులను చేపట్టాలని సూచించారు. ముధోల్ లో గ్రామపంచాయతీ నుండి అనుమతి తీసుకోకుండా ఓ వ్యక్తి నిర్మాణం పనులు చేపట్టడంతో శనివారం ఆ పనులు చేస్తున్న తాపీ మేస్త్రికి పంచాయతీ కార్యదర్శి అన్వర్ నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఇండ్లు నిర్మిస్తున్న వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోరారు.
అనుమతి ఉంటేనే నిర్మాణాలు చేపట్టాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES