Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంతరం పోరాటం

ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంతరం పోరాటం

- Advertisement -

స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మెందర్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారంసంఘా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ టి యు భవన్ లో సంఘం పతకాన్ని జిల్లా అద్యక్షులు  ధర్మెందర్ ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాం ప్రభుత్వంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాడానికి మగ్దూం మొయినుద్దీన్ 1947 లోఏర్పాటు చేసిన సంఘం స్టేట్ టీచర్స్ యూనియన్.అప్పటినుండి నిరంతరం ఉపాధ్యాయుల హక్కులకోసం పోరాడుతూ మొదటగా పిఆర్సి , డి ఎ, పెన్షన్ లను సాధించి పెట్టిన సంఘం ఎస్ టి యు, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని ప్రతి తరగతి కి ఒక ఉపాధ్యాయుడు ఉండేవిధంగా ,భౌతికశాస్త్రం,ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ప్రతి ఉన్నత పాఠశాల లో ఉండాలి అని మొదటగా చెప్పి దానిని సాధించడం జరిగింది.ఈ విధంగా ఉపాధ్యాయుల హక్కులు,సంక్షేమం ,పాఠశాలల బలోపేతం కోసం కృషి చేస్తూ,విద్యార్థులు ఉన్నతిని ఆకాంక్షిచే సంఘం   స్టేట్ టీచర్స్ యూనియన్ అని, ఎస్ టి యు ముందు తరం నాయకులైన కాళోజీగారు,ప్రో.జయశంకర్ సార్, పూర్వ ఎమ్మెల్సీ లైన వాణి విజయరామారావు, రామమూర్తి,రాష్ట్ర,జిల్లా పూర్వ అధ్యక్ష కార్యదర్శులు బాటలో నడిచి సంఘ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -