Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్ట్‌ కార్మికుడు మృతి

ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్ట్‌ కార్మికుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ -బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో గురువారం ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్ముగూడెం మండలం పెదకమలాపురం గ్రామానికి చెందిన పర్సిక హరీశ్‌ (24) సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం విధులకు హాజరైన ఆయన భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. భద్రాచలం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని ఐటీసీ గుర్తింపు సంఘం అధ్యక్షులు కనకమేడల హరిప్రసాద్‌ తెలిపారు. కాగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో ఇంకా మృతుని బంధువులు ఫిర్యాదు చేయలేదని సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad