- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నెలలు నిండని శిశువు మృతదేహం కుక్కనోట్లో కనపడి కలకలం రేపింది. పట్టణంలోని విద్యానగర్ కు వెళ్లే సబ్ జైల్ రోడ్ లో కుక్క శిశువు మృతదేహాన్ని నోట కరుచుకొని వెళ్తుండడంతో స్థానికులు గుర్తించి వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సీఐ నాగభూషణం వివరాలు సేకరించారు. శిశువు మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆడ శిశువు కావడంతోనే అబార్షన్ చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -


