Thursday, June 26, 2025
E-PAPER
Homeసినిమాకాపీ కొట్టారు

కాపీ కొట్టారు

- Advertisement -


”కానిస్టేబుల్‌ కనకం’ ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రాజెక్ట్‌. భారీ బడ్జెట్‌, హై ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నాం. ఒక ఓటీటీ సంస్థ ఇదే కథని కాపీ కొట్టి, ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. దీనిపై మేం న్యాయపోరాటం చేస్తున్నాం’ అని దర్శకుడు ప్రశాంత్‌ కుమార్‌ అన్నారు.
వర్ష బొల్లమ్మ టైటిల్‌ రోల్‌లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకుడు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేటూరి హేమంత్‌ కుమార్‌ దీన్ని నిర్మించారు. రాజీవ్‌ కనకాల, మేఘ లేఖ, రమణ భార్గవ్‌ కీలక పాత్రలు పోషించారు.
దర్శకుడు ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘ఈ మధ్యకాలంలో ఇదే కథతో వేరే ఓటీటీ సంస్థ నిర్మించిన ఒక ట్రైలర్‌ బయటకు వచ్చింది. అది చూసి మేము షాక్‌ అయ్యాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కోర్టులో కేసు నడుస్తోంది. ఒక దర్శక, రచయితగా కథని ఎంతో మందికి చెప్తాను. ఈ క్రమంలో ఒక ఓటీటీ సంస్థకి చెప్పాను. అలాగే దాన్ని మెయిల్‌ రూపంలో వాళ్లకి పంపించాను. కొంత వర్క్‌ అయిన తర్వాత వాళ్లు వద్దనుకున్నారు. తర్వాత దీన్ని ఈటీవీ విన్‌లో చేశాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తున్నాం’ అని అన్నారు.
‘ఇది ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ సిరీస్‌. మేము దేని నుంచి కాపీ కొట్టలేదు. ఈ కథని 2022లో రిజిస్టర్‌ చేసాం. దీన్ని సీజన్‌1, సీజన్‌ 2గా ఈటీవీలో చాలా ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నాం’ అని ఈటీవీ విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయి కష్ణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -