సరియైన పత్రాలు లేని 165 మోటర్ సైకిల్స్ , నాలుగు ఆటోలు, గాంజా చాక్లెట్స్, రెండు హుక్కా పార్ట్, ఒక ఎయిర్ గన్ సీజ్ ..
అనుమానిత వ్యక్తుల సమాచారం సమీప పోలీస్ స్టేషన్ కు అందించాలి
నేర నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : నల్లగొండ జిల్లా కేంద్రంలో వన్ టౌన్ పరిధిలో గల మాన్యంచెల్కాలో శుక్రవారం తెల్లవారు జామున 1 డి.ఎస్.పి , 8 మంది సీఐలు 24 యస్.ఐలు మొత్తం కలిపి 320 మంది పోలీస్ సిబ్బంది, ఒక పేలుడు పదార్థం గుర్తించే డాగ్, నార్కోటిక్ డాగ్ తో కాటన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 500 ఇళ్లల్లోసోదాలు చేయగా, సరియైన పత్రాలు లేని 165 వాహనాలు, నాలుగు ఆటోలు, గంజా చాక్లెట్స్, రెండు హుక్కా పార్ట్, ఒక ఎయిర్ గన్ సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ.శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎక్కువగా జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 150 అనుమానితులను గుర్తించడం జరిగిందని తెలిపారు. అలాగే నలుగురు రౌడీ షీటర్స్ అదుపులో తీసుకోగా వీరిలో ఒకరీ వద్ద నుండి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మొత్తం 30 మందిని గాంజా టెస్ట్ నిర్వహించగా 8 మంది సేవించినట్టు టెస్టులో రిపోర్ట్స్ రావడం జరిగిందని, వీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేసి సేవించారనే దానిపైన విచారణ జరుపుతున్నామని అన్నారు.
ముఖ్యంగా కమ్యూనిటి కాంటాక్టులో భాగంగా పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కాలనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఆద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించాలని గంజాయి తదితర మాదకద్రవాలను నిలువరించడం కోసం కృషీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయిని ఆరికట్టడం కోసం మూడు దశల్లో కార్యాక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైన గంజాయి సేవిస్తున్నట్లు,విక్రయించినట్లు, కానీ రవాణా చేస్తున్నట్లు కానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి,సీఐలు రాజశేఖర్ రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, నాగరాజు, రాజశేకర్, సీఐ మహాలక్ష్మయ్య, కరుణాకర్ ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో కార్డెన్ అండ్ సెర్చ్ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES