మళ్ళీ కరోనా కలకలం…

– ఉమ్మడి జిల్లా కేంద్రం ఖమ్మం లో ఒక కేసు నమోదు….

– మండల, నియోజక వర్గం కేంద్రాల్లో సిద్దం చేస్తున్న ఐసోలేషన్ గదులు….
– మాస్క్ వాడకం, దూరం పాటించడమే శిరోధార్యం – సి.హెచ్.సి అత్యవసర వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
కరోనా కలకలం మానవ సమాజాన్ని మళ్ళీ భయబ్రాంతులకు గురిచేస్తుంది.ఇప్పటికే రెండు దశల కోవిడ్ మహమ్మారి నుండి సమాజం కోలుకుంటున్న దశ లో కొత్త వేరియంట్ మరొకటి ఉనికిలోకి రావడం ఉమ్మడి జిల్లా కేంద్రం ఖమ్మం లో ఒక కేసు నమోదు అవడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అవుతుంది.
మండల,నియోజక వర్గం కేంద్రాల్లోని ప్రాధమిక,సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా చికిత్సకు అవసరం అయిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఐసోలేషన్ లు ఏర్పాటు
కరోనా మహమ్మారి బలంగా విస్తరిస్తే అందుకు తగ్గట్టు ఎదుర్కోవటానికి వైద్య,ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది.ఇప్పటికే వైరస్ వ్యాప్తిని గమనిస్తున్న వైద్యాధికారులు జిల్లా దవాఖానాలు, పీ.హెచ్.సీ,సీ.హెచ్.సీ లలో కోవిడ్ కు చికిత్స కోసం పడకల ను(బెడ్ లు) ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన ఆర్టీ.పీ.సీ.ఆర్ కిట్లు, వెంటిలేటర్ లు మాస్క్ లు, ఆక్సీజన్,అత్యవస మందులు, ఇంజక్షన్ లు సిద్ధం చేసుకుంటున్నారు.మండలాల వారీగా ఆసుపత్రులు లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.ఎటువంటి వైరస్ లక్షణాలు ఉన్నా వెంటనే నమూనాలు సేకరించి పరీక్షించే లా సమాయత్తం అవుతున్నారు.రద్దీ ప్రాంతాల్లో తిరగకుండా మాస్క్ లు ధరించి, కనీసం దూరం పాటించాలని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.చేతులను శానిటేషన్ చేసుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సృష్టం చేస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి –  డాక్టర్ విజయ్ కుమార్, అత్యవసర వైద్యులు, అశ్వారావుపేట.
కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. చేతులు శానిటైజ్ చేసుకుంటూ మాస్క్ లు ధరించాలి. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో తిరగకుండా దూరం పాటించాలి.పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా ఇమ్యూనిటి స్థాయి పెంచుకోవటం తో కరోనా వైరస్ నుండి రక్షించుకోవచ్చు. ఉన్నతాధికారుల సూచనలతో ఐసోలేషన్ సెంటర్లో బెడ్ లు ఏర్పాటు చేస్తున్నాము. అసరమైన అన్ని మందులు, మాస్క్ లు, అర్టీ.పీ.సీ.ఆర్ కిట్లు అందుబాటులో ఉంచు తున్నాము.అయినా కూడా ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా బారి నుండి పూర్తి రక్షణ ఉంటుంది. ఏదైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
Spread the love