- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన ఉప్పునూతల అరుణ మల్లయ్య దంపతుల కుమార్తె ఉప్పునూతల సౌమ్య ఏఆర్ కానిస్టేబుల్ గా వరంగల్ సిపి కార్యాలయంలో విధులు నిర్వహించారు. గురువారం తిరుమలగిరిలో జరిగిన సౌమ్య నిశ్చితార్థ కార్యక్రమానికి వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ దంపతులతో పాటు జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపి అంబటి నర్సయ్యలు పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి, పాలకుర్తి ఎస్సై మేకల లింగారెడ్డి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -