Saturday, December 13, 2025
E-PAPER
Homeజిల్లాలురెండో విడత పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

రెండో విడత పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే నిజామాబాదు డివిజన్ పరిధిలోని పోలింగ్ బూతులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రధానంగా మాక్లూర్ మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఉర్దూ మీడియం స్కూల్ పోలింగ్ కేంద్రాలను మరియు కౌంటింగ్ సన్నాహాలు ఎలా జరుగుతున్నాయో సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూతుల సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతూ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో నిజామాబాదు డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ లలో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు , భద్రత ఏర్పాట్లను పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు , ప్రజా శాంతిభద్రతల పరిరక్షణపై సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అనుచిత కార్యకలాపాలు , గుంపులుగా తిరగడం , ప్రలోభాలు లేదా బెదిరింపులకు తావు లేకుండా కట్టుదిట్టమైన పహారా నిర్వహించాలనీ తెలిపారు. అధిక ప్రాధాన్యత గల , సున్నిత పోలింగ్ స్టేషన్లలో అదనపు సిబ్బంది ని నియమించిన నేపథ్యం లో అప్రమత్తంగా వ్యవహారించాలి అని సూచించారు. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో 163 బిి ఎన్ ఎస్ ఎస్ అమలులో ఉన్నందున , నలుగురికి మించి వ్యక్తులు ఉండకుండా కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండకూడదని ఆదేశించారు. ప్రజలు ధైర్యంగా, భయభ్రాంతులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సిబ్బంది మర్యాదపూర్వకంగా, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు నిరభ్యంతరంగా ఓటు వేయాలని తెలిపారు.ఈ సందర్బంగా నిజామాబాదు ఎ. సి. పి  రాజా వెంకట్ రెడ్డి సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్. ఐ  రాజశేఖర్  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -