- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఈద్గా ప్రాంతాల్లో ముస్లిం సోదరుల సామూహికంగా ప్రార్థనలు దృష్టిలో మండలంలోని అంకాపూర్ వద్ద ఈద్గా ప్రాంతాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, శుక్రవారం సాయంత్రం సందర్శించారు.
ట్రాఫిక్ , పార్కింగ్ , భద్రతపై నిర్వహుకులతో పాటు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పండుగ సందర్భంగా పార్కింగ్ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ పి.సత్యనారాయణ పాల్గొన్నారు.
- Advertisement -



