నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత రావును ని కోరారు. బుధవారం రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావును సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా బృందం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేద ప్రజలకే అందే విధంగా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్ళేం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, ఏశాల అశోక్, కురిమిద్ద శ్రీనివాస్, చిగుర్ల లింగం, పెరబోయిన మహేందర్, మండల కార్యదర్శులు అన్నేమైన వెంకటేష్, దాసరి లక్ష్మయ్య, లక్ష్మి పతి లు పాల్గొన్నారు.