Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల కోసం పనిచేసే పార్టీ సీపీఐఎంఎల్సీ: నెల్లికంటి సత్యం

ప్రజల కోసం పనిచేసే పార్టీ సీపీఐఎంఎల్సీ: నెల్లికంటి సత్యం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
ప్రభుత్వ పదవుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పని చేయదని ప్రజల పక్షాన పోరాటాలు చేసి ప్రజా సంక్షేమ కోసం పాటు పడు తుందని నల్లగొండ జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో జరిగిన సీపీఐ మండల మహా సభలో భాగంగా జెండాను ఆవిష్కరణ చేసి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని  పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు. కార్మికుల, కూలీల హక్కుల సాధన కోసం పోరాడేది సీపీఐ పార్టీ అని అన్నారు. ఉపాది హామీలాంటి అనేక చట్టాలను అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించామన్నారు. కేంద్రం కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ పేదలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు, తదితర సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు, నిరుపేదలకు ఇవ్వాలని సూచించారు. నిత్యావసర ధరల పెరుగుదల, కార్మికుల హక్కులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా ప్రజలకు అండగా సిపిఐ జెండా నిలబడి పోరాడుతుందని తెలిపారు.

ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా, ప్రజా సమస్యలే అజెండాగా నిత్యం ప్రజల మధ్య నిలబడి పోరాడే పార్టీ సిపిఐ అని, శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని దున్నేవాడికి భూమి కావాలని, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినపార్టీ సిపిఐ అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్మరించి  పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాటిని అదుపు చేయకుండా  పేదవారి నడ్డి విరిచే విదంగా మళ్ళీ సిలిండర్ ధర పెంచడం అన్యాయమని అన్నారు.పండించిన పంట కు గిట్టుబాటు ధర మరియు,ఎరువులు విత్తనాలు సబ్సిడి మీద ఇవ్వాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను చిత్తశుద్ధితో  అమలు చేయాలని ఆయన కోరారు.నకిలీ విత్తనాలు అరికట్టి రైతులకు  నాణ్యమైన విత్తనాలు అందించాలని కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.మండల కార్యదర్శి గడ్డంపల్లి బిక్షం రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బిక్షంరెడ్డి,  సిపిఐ పెద్దవూర సీనియర్ నాయకులు పొదిల నరసింహ, గుర్రంపోడు మండల కార్యదర్శి లక్ష్మీపతి, సిపిఐ పెద్దవూర మండల సహాయ కార్యదర్శి రొయ్య రాములు,శోభన్ బాబు,నాగర్జున,జయప్రకాశ్ రెడ్డి, విజయానంద్ రెడ్డి, సిపిఐ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -