- Advertisement -
హైదరాబాద్ : ఐటీ డేటా ఇంజిన్, సెక్యూరిటీకి సంబంధించిన క్రిబిల్ సంస్థ యూజర్ గ్రూప్ తొలి సమావేశం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. క్రిబిల్ భాగస్వామిగా సీక్వెన్స్.ఏఐ సంస్థ ఈ సమావేశానికి సమన్వయ కర్తగా వ్యవహరించింది. అబ్జర్వబిలిటీ, డేటా ఇంజినీరింగ్, స్ట్రీమింగ్ టెక్నాలజీ నిపుణులు సంబంధిత అంశాల్లో అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు. క్రిబిల్ యూజర్ కమ్యూనిటీకి ఈ సమావేశం హైదరాబాద్లో ఓ బలమైన పునాది వేసింది. జెపి నెల్లూర్, యుఎస్ఎస్ ఉప్పులూరి, లగ్గాని శ్రీనివాస్ తదితరులు క్రిబిల్ సమావేశంలో పాల్గొన్నారు.
- Advertisement -