- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఆయన పదవీ కాలం పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తూ మరో మూడు నెలలు పొడిగించింది. గతేడాది ఏప్రిల్ 30న సీఎస్గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఆగస్టులోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అప్పుడు ఏడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే.
- Advertisement -



