నవతెలంగాణ – దుబ్బాక : అసంపూర్తిగా ఉన్న కల్వర్టు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ గురువారం పెద్ద చీకోడు మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎల్.రాంరెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈ వేణు బాబుకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, దుబ్బాక మండల పరిధిలోని కమ్మరపల్లి మీదుగా వెళుతున్న మల్లన్న సాగర్ 4 ఎల్ డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్ పై నిర్మిస్తున్న కల్వర్టు పనులు కొంతకాలంగా మందకొడిగా సాగుతున్నాయని, దీంతో ఆ కాల్వ మీదుగా వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే ఆ కల్వర్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు పంబాల రమేష్, దారబోయిన ఆంజనేయులు, వనం పోచయ్య పలువురున్నారు.
కల్వర్టు పనులను వెంటనే పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES