- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో షాపులు, కంపెనీలు, ఫ్యాక్టరీలలో రోజువారి పనిగంటలు పెంచే సవరణ బిల్లులను ఏపీ అసెంబ్లీ ప్రతిపాదించింది. ప్రస్తుతం రోజుకు ఎనిమిది గంటల పని ఉండగా… దానిని 10 గంటలకు పెంచారు. వారానికి 48 గంటల్లో మార్పు లేదు. ఫ్యాక్టరీలలో బ్రేక్ టైం తో కలిపి 12 గంటలకు మించకూడదని పేర్కొన్నారు. ప్రతి ఆరు గంటలకి తప్పకుండా రెస్ట్ ఇవ్వాలని చెప్పారు. మహిళల నైట్ షిఫ్ట్ రాత్రి 7 గంటల నుంచి 8:30 కు-ఉదయం 6 గంటలకు మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు.
- Advertisement -