నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రానికి చెందిన జాతీయ విగ్రహాలు వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ఎంపిటీసీ మండల ఫోరం అధ్యక్షులు పులిమాల కృష్ణారావుకు దళిత హక్కులు, ఆత్మగౌరవం కోసం కొనసాగిస్తున్న పోరాటానికి గుర్తింపుగా దళిత రత్న అవార్డు అందుకున్నారు. పులిమాల కృష్ణారావు గత కొన్ని సంవత్సరాలుగా దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కుల కోసం, అలాగే పేదల సంక్షేమం కోసం నిరంతర ఉద్యమాలు చేస్తున్నారు. ఆయన సేవలను, కృషిని గుర్తించిన శుక్రవారంహైదరాబాదు రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాల చైర్మన్ ఇటుక రాజు చేతుల మీదగా దళిత రత్న అవార్డును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బొంగరాల వెంకటేశ్వర్లు, కళాకారుడు కుక్కమూడి ముత్యాలు, మాదిగ జేఏసీ యూత్ అధ్యక్షులు కలకొండ పరమేష్,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బనిగే విద్యాసాగర్, ఎంఇ ఎఫ్ రాష్ట్ర నాయకులు బోనిగా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
పులిమాల కృష్ణరావుకు దళితరత్న అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES