- Advertisement -
నవతెలంగాణ – మొయినాబాద్
మండల పరిధిలోని బాకారం గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ రెండవ విడుత నామినేషన్ల సందర్భంగా ఎన్నికల శాంతిభద్రత కోసం కట్టుదిట్టమైన పోలీస్ పర్యవేక్షణ, సమగ్రత తనిఖీలకు సంబంధించి ఆయన పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధుల్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ బి. కిషన్ , మొయినాబాద్ ఇన్ స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



