- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ప్రయివేటు ఎరువుల, విత్తనాల వ్యాపారులకు యూరియా విక్రయాలపై అవగాహన కార్యక్రమాన్నీ నిర్వహించినట్లుగా మండల వ్యవసాయాధికారి శ్రీజ తెలిపారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతువేదిక కాటారం నందు “ఫెర్టిలైజర్ బుకింగ్” ఆప్ పై అవగాహనలో బాగంగా రైతులకు కావలసిన యూరియా బస్తాలను ఈ యాప్ ద్వారా పట్టా పాస్ బుక్, ఆధార్ అనుసంధానంగా పంట నమోదు ఆప్లో చేసుకొని ముందుగానే యూరియా బుక్ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. దీని గురించి సొసైటీలకు, డిసిఎంఎస్, ప్రయివేట్ డీలర్స్ షాపు యజమానులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ డివిజన్ ఎంఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.
- Advertisement -



