నవతెలంగాణ – పరకాల : పరకాల మండల ఎరువులు, పురుగుమందులు, విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం పరకాల ఫర్టిలైజర్స్ మాజీ అధ్యక్షులు సూర్యదేవర సదానందం అధ్యక్షతన స్వర్ణ గార్డెన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషమన్ మాజీ చైర్మన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ సీడ్స్ జిల్లా అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంగావించారు. నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగాఎన్ని కయిన అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ యాని శివాజీ కోశాధికారిగా,మల్లికార్జున ట్రేడర్స్ యజమాని ఎర్ర లక్ష్మణ్ ఎన్నికైన విషయం తెలిసిందే, నూతన కమిటీని మాజీ అధ్యక్షులు సూర్యదేవర సదానందం ప్రమాణ స్వీకారం చెహించడం జరిగింది. అనంతరం శాలువాలతో సత్కరించి బొకే అందించి నూతన కమిటీ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన గందె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… నా మీద నమ్మకంతో అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించిన డీలర్ మహాశయులకి ఎల్లవేళలా రుణపడి ఉంటానని బాధ్యతాయుతంగా నాకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తానని హామీ ఇచ్చారు.నాతోటి వ్యాపారస్తులకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ జిల్లా కమిటీకి పరకాల అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకి వ్యాపారస్తులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES