నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్.హెచ్.ఓ రఘుపతి శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 29వ తేదీ మధ్యాహ్న సమయం 15:00 గంటలకు దేవి రోడ్ మెఘ వైద్యనాథ్ ఆయుర్వేదిక్ షాప్ దగ్గర గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడి ఉందని తెలిపారు. డయల్ 100 కాల్ రాగా టౌన్ 1 బ్లూ కోర్ట్ సిబ్బంది వెళ్లి అక్కడ నుండి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు వచ్చి పరిశీలించి అడ్మిట్ చేసుకుని చికిత్స అనంతరం ఈ నెల 30న మధ్యాహ్నం మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతి చెందిన మహిళ వయసు అందజ 35 నుండి 40 సంవత్సరాలు ఉంటాయి. ఆమె వాలకం బట్టి లేబర్ పని చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నది. ఈమె పైన వంకాయ కలర్ చీర, నీలి రంగు కలర్ జాకెట్ ధరించి ఉంది. ఈమె దగ్గర చెక్ చేయగా ఏమి ఆధారాలు దొరకలేదు. గుర్తు తెలియని మహిళగా గుర్తిం,చి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్ 8712659714 సంప్రదించాలన్నారు.
గుర్తుతెలియని మహిళ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES