Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసిఐసి ఉత్తర్వులను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు

సిఐసి ఉత్తర్వులను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ గ్రాడ్యుయేషన్‌ పట్టాపై కేంద్ర సమాచార కమిషన్‌ (సిఐసి) జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు సోమవారం నిలిపివేసింది. సిఐసి ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు నేడు జస్టిస్‌ సచిన్‌ దత్తా తీర్పు వెల్లడించారు. ప్రధాని మోడీ గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి ఆర్‌టిఐ కార్యకర్త నీరజ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 1978లో బిఎ పరీక్షలో ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఉత్తీర్ణులైన విద్యార్థులందరి రికార్డులను తనిఖీ చేయడానికి ఆర్‌టిఐ కార్యకర్త నీరజ్‌కి అనుమతినిస్తూ 2016 డిసెంబర్‌ 21న సిఐసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఢిల్లీ యూనివర్శిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సచిన్‌ దత్తా ఫిబ్రవరి 27న తీర్పును రిజర్వ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad