- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి కృత్రిమ మేధా ల్యాబ్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 6 ల్యాబ్లను ప్రభుత్వం మంజూరు చేయగా రామారెడ్డి మండల కేంద్రంలో ప్రారంభించామని, 1 వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు గణితశాస్త్రంలో వృద్ధి చెందడానికి విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఉపాధ్యాయులు రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -