నవతెలంగాణ- మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి భూ హక్కుల ఆర్ఓఆర్ చట్టం రెవిన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారం కోసమేనని మద్నూర్ మండల డిప్యూటీ తాసిల్దార్ శివరామకృష్ణ ఆర్ ఐ శంకర్ తెలిపారు. రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం నాడు మద్నూర్ మండలంలోని రాచూరు గ్రామంలో రెవిన్యూ అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఆ గ్రామ శివారు రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు ఇవ్వగా అధికారులు స్వీకరించారు. భూభారతి చట్టం పరిధిలో భూ సమస్యలు తప్పకుండా పరిష్కరించడం జరుగుతాయని రెవెన్యూ అధికారులు తెలిపారు .ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు సిబ్బంది ఆ గ్రామ వ్యవసాయదారులు పాల్గొన్నారు.
భూభారతి రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారం కోసమే: డిప్యూటీ తాసిల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES