- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో 2025/ 2026 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల జాతరలో వ్యక్తిగత మరియు సామూహిక పనులకు శుక్రవారం భూమి పూజలు ఆలేరు ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొలనుపాక గ్రామంలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ తూర్పు గూడెం,పటేల్ గూడెంలో అంగన్వాడి భవనానికి శంకుస్థాపన జరిపినారు. ఈ కార్యక్రమంలో ఏఈ(పి ఆర్) నవ్య ఏపీఓ అరుణకుమారి ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రామచంద్రయ్య గ్రామ కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
- Advertisement -