సర్పంచుల సంఘం అధ్యక్షులు సాయినాథ్..
నవతెలంగాణ- కుభీర్
ముధోల్ నియోజక వర్గంలో ఉన్న ప్రతి ఒక్క పేద మధ్య తరగతి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కుభీర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కందురు సాయినాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కుభీర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే మండలంలో ఉన్న పలు గ్రామలు అభివృద్ది చెందుతాయి అని అన్నారు. అదే విదంగా మొదటి దశలోనే జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పనులు ముందుగా ఉందని తెలపరు. మిగిలిన వారు వెంటనే మార్కోటింగ్ వేసుకొని పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగా సాగర్ రెడ్డి,బైంసా ఆత్మ కమిటీ చెర్మన్ సిద్ధం వివేకానంద,పంచాయతి కార్యదర్శి విజయ్ కుమార్, ఇందిరమ్మ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి పనులు సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



