నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షులు కాంతారావు,నియోజక వర్గం ఇంచార్జి మెచ్చా నాగేశ్వరరావు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. మున్సిపాల్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా లో వీధి లైట్లు వెలిగించాలని, మంచినీటి సరఫరా చేయాలని,పారిశుధ్యం పనులు చేపట్టాలని మున్సిపాలిటీ సిబ్బందికి వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎంపీపీ మాజీ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. మహిళా నాయకురాలు వగ్గెల పూజ, అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్,టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, పేరాయిగూడెం అధ్యక్షులు బజారయ్య,మందపాటి రాజమోహన్ రెడ్డి,గుర్రాల చెరువు మాజీ సర్పంచ్ కలపాల దుర్గయ్య,నార్లపాటి చిన్నబ్బాయి, కార్యకర్తలు, నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES