నవతెలంగాణ – కామారెడ్డి: కామారెడ్డి మండలం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఏ డిజిటల్ ఉపకరణం కాదని అన్నారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచాలని, సామాజిక సర్దుబాటులు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు మారుతున్న కాలంతోపాటు అప్డేట్ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మండల విద్యాధికారి వై. ఎల్లయ్య, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ డా. సుభాష్, డిఆర్పిలు ప్రసూన్, బాలరాజ్, రాజభైరయ్య, 8 మండలాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ శిక్షణ శిబిరం సందర్శించిన డైట్ ప్రిన్సిపాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES