- Advertisement -
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆద్వర్యంలో టి.బి. నిర్మూలనలో భాగముగా జిల్లా ఆస్పత్రి నందు ఏ.ఆర్.టి సెంటర్ లో అత్యధునిక డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చెస్ట్ ఎక్స్ పరికరంను శుక్రవారం. డిప్యూటి డి.ఎం. హెచ్.ఓ,నల్లగొండ , డా॥ వేణుగోపాల్ రెడ్డి,, జిల్లా క్షయనివారణ అధికారి డా॥ కళ్యాణ్ చక్రవర్తి, ప్రారంభించారు. ఈ ఎక్స్రే క్యాంప్ నెలరోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కావున, అందరు జిల్లా ప్రజలందరు సద్విని యోగం చేసుకోగలరని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, డిప్యూటి సూపరిన్టెండెంట్ డా॥ నగేష్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



