Monday, October 6, 2025
E-PAPER
Homeసినిమా'మిరాయ్' టీమ్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన దిల్‌రాజు

‘మిరాయ్’ టీమ్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన దిల్‌రాజు

- Advertisement -

హీరో తేజా సజ్జా నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయయాత్ర కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా నిర్మాత దిల్‌ రాజు మిరాయ్ టీంని అభినందించారు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని హీరో తేజసజ్జా కోసం తమ ఇంట్లో ఆత్మీయంగా ఒక వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తేజసజ్జాతో పాటు డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ఇది అభిమానం, అభినందనలతో కూడిన ఒక ఆద్భుతమైన సందర్భంగా నిలిచింది. ”మిరాయ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో రూ.150 కోట్లకి పైగా వసూలు చేసింది. నార్త్‌ అమెరికాలో 3 మిలియన్‌ డాలర్ల మార్క్‌ని దాటింది. రితికా నాయక్‌ హీరోయిన్‌గా, మనోజ్‌ మంచు, శ్రీయా శరణ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్‌ ప్రెజెంటేషన్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మిరాయ్ థియేటర్స్‌లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇటీవల విడుదలైన చిత్రాల్లో ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో మంచి కలెక్షన్లను కలెక్ట్‌ చేస్తోంది. అలాగే ‘వైబ్‌ ఉందిలే’.. పాటను జత చేశాక సినిమా మరింత మందికి రీచ్‌ అయ్యింది. ఈ పాట సినిమా విడుదలకు ముందే హిట్‌సాంగ్‌గా నిలిచింది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -